Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : గోపన్ పల్లి పెద్ద చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. శేరిలింగంపల్లి రెవెన్యూ, ఇరిగేషన్, జిహెచ్ఎంసి అధికారులు కలిసి పెద్ద చెరువు శిఖం స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను నీలమట్టం చేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపనపల్లి సర్వేనెంబర్ 33/ఏ లో చిన్న పెద్ద చెరువు విస్తరించి ఉంది. గత కొంతకాలంగా పెద్ద చెరువును పూడ్చి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపడుతున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఇరిగేషన్, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి గురువారం పెద్ద చెరువు వద్దకు చేరుకున్న రెవెన్యూ అధికారులు చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ఈ మేరకు జెసిబితో సదరు నిర్మాణాలను నేలమట్టం చేశారు. రేకులతో నిర్మించిన ఆరు ఇళ్లు, మూడు షెడ్లను, ఓ మూడంతస్తుల భవనం గోడలను కూల్చివేశారు. భవిష్యత్తులో చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Also Read : విదేశాలకు పారిపోయిన గచ్చిబౌలి డ్రగ్స్ నిందితుడు
Admin
Ekaburu