Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తన తుది శ్వాస వరకు తెలంగాణ కోసం పరితపించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని శేరిలింగంపల్లి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి సాయిబాబా నివాళులర్పించారు. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దిక్సూచిగా నిలిచి, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ఎలుగెత్తి చాటిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటాన్ని తెలంగాణ ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ యువతులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి, రాగం జంగయ్య యాదవ్, బాబు మియా, తిరుమల్లేష్, దారుగుపల్లి నరేష్, అంజమ్మ, నారాయణ, రమేష్ గౌడ్, భిక్షపతి, శ్రీనివాస్, అనిల్ సింగ్, నరేష్ సింగ్, మధు, నర్సింగ్ రావు, నవాజ్, సాయి, అజీమ్, గౌస్, ఖాదర్, బాలామని, సుగుణ , మాధవి తదితరులు పాల్గొన్నారు.
Also Read : రాయదుర్గం నాగాహిల్స్ ప్లాట్లపై మరోసారి వివాదం
ప్రజా గాయకుడు గద్దర్ కు ఘన నివాళి... ప్రజా యుద్ధ నౌక, ప్రజా గాయకుడు గద్దర్ మొదటి వర్ధంతి సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి శేరిలింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో గద్దర్ పాత్ర ఎంతో కీలకమని, ఆయన తన గేయాలతో తెలంగాణ యువతలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu