Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : హైదరాబాద్ నగరంలో నిర్వహించే రంజాన్ వేడుకలు, ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలిలో నిర్వహించిన దవాత్- ఏ - ఇఫ్తార్ విందులో ఆదివారం సాయిబాబా పాల్గొన్నారు. గచ్చిబౌలిలో సయ్యద్ పాషా & సన్స్ (లడ్డు భాయ్ ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విందులో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్న సాయిబాబా మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం అభినందించదగ్గ విషయం అని, తెలంగాణకు ప్రత్యేకమైన "గంగా జమునా తెహజీబ్" మరింతగా పరిఢవిల్లాలని అన్నారు.
Also Read : హోప్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం : స్పెషల్ మేజిస్ట్రేట్ అశోక్ నేత
రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని సాయిబాబా అభిలషించారు. రంజాన్ మాసం ఉపవాసంతో మంచి తనం, సంస్కారం అలవడుతుందని, హైదరాబాద్ లో రంజాన్ వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, మానిఫెస్టోలో లేని అంశాలను సైతం ప్రవేశపెట్టి, ముస్లింల సంక్షేమానికి కృషి చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాషా భాయ్, తాహెర్, నవాజ్ లతో పాటు ముస్లిం మత పెద్దలు, స్థానిక ముస్లిం సోదరులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Ekaburu