Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లిలో నూతన అనంత హోమియోపతి క్లినిక్ ప్రారంభమైంది. ఆదివారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అనంత హోమియోపతి క్లినిక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంత హోమియో క్లినిక్ యజమానులు డాక్టర్ చంద్రశేఖర్, సుచరితలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాస్త్రీయమైన వైద్య విధానం హోమియోపతి అని, పేద, మధ్యతరగతి ప్రజలు తక్కువ ఖర్చుతో విలువైన వైద్యాన్ని పొందవచ్చన్నారు.
మన భారతీయ సనాతన వైద్య చికిత్స హోమియోపతితో నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో జబ్బులకు చికిత్స అందుబాటులో ఉందని అన్నారు. ఐటీ కారిడార్ ప్రజలకు అనంత హోమియో వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు అందరూ ఈ సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శంకరి అనంతయ్య ముదిరాజ్, శేఖర్, శంకర్, విష్ణు, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu