Ekaburu - శేరిలింగంపల్లి / : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి గ్రామంలో జరిగిన శ్రీ నాభిశీల బొండ్రాయి ప్రాతిష్టాపన మహోత్సవం కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ శ్రీ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబాతో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో బొడ్రాయిని పూజించే సంప్రదాయం మన పూర్వీకుల నుంచి వస్తుందన్నారు. గ్రామంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని , ఎలాంటి అభశుభాలు జరుగకుండా ఉండలని పూర్వకాలంలో మన పెద్దలు బొడ్రాయి ని ప్రతిష్టించే వాళ్లు అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. అమ్మ వారి ఆశీర్వదాం ఎల్లప్పుడు ప్రజలపై ఉండలని అమ్మ వారిని వేడుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామరాజు, అనిల్, రాజు ముదిరాజు, శ్రీశైలం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu