Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : గంజాయి వ్యాపారులను అరెస్టు చేయడంతో పాటు గంజాయి స్వాధీనంలో చురుకుగా వ్యవహరించిన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందికి మాదాపూర్ డిసిపి డాక్టర్ జి. వినీత్ రివార్డులు అందజేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్ రాంగూడలో గంజాయి వ్యాపారంపై సమాచారం అందుకున్న పోలీసులు గంజాయి స్థావరాలపై గతకొన్ని రోజుల క్రితం దాడులు చేశారు. కాగా ఈ దాడుల సందర్భంలో గంజాయి వ్యాపారులు తెలివిగా పోలీసులను అడ్డుకునేందుకు, గంజాయిని డ్రైనేజీ కాలువలో పారవేసి ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు.
Also Read : రాములోరి తలంబ్రాలు హోమ్ డెలివరీ : హెచ్ సీయు డీఏం మురళీధర్ రెడ్డి
ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ బి.సాయినాథ్, హెడ్ కానిస్టేబుల్ రామచంద్రయ్యలు చాకచక్యంగా వ్యవహరించారు. గంజాయి మిస్సింగ్ కాకుండా చూడడంతో పాటు గంజాయి వ్యాపారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో గంజాయి వ్యాపారులను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన ఎస్ఐ సాయినాథ్, హెడ్ కానిస్టేబుల్ రామచంద్రయ్యలను బుధవారం మాదాపూర్ డిసిపి వినీత్ అభినందించడంతో పాటు రివార్డులను అందజేశారు. కార్యక్రమంలో గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ ఎస్. ఆంజనేయులు పాల్గొన్నారు.
Admin
Ekaburu