Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : భద్రాద్రి రాములోరి తలంబ్రాలు భక్తులకు హోమ్ డెలివరీ సదుపాయం తెలంగాణ ఆర్టీసీ కల్పిస్తుందని హెచ్ సీయు డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 151 రూపాయలు చెల్లిస్తే ఆర్టీసీ కార్గో ద్వారా ఈ పంపిణీ చేస్తామని అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలు భక్తులకు అందించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని, గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి తలంబ్రాలు హోమ్ డెలివరీ కార్యక్రమానికి టిఎస్ఆర్టిసి శ్రీకారం చుట్టిందని అన్నారు.
Also Read : యుద్ధాన్ని జయించిన భారత అమ్మాయిలు
శ్రీరాముడి తలంబ్రాలు కావలసిన వారు ఈనెల 17వ తేదీ వరకు టిఎస్ఆర్టిసి లాజిస్టిక్ కౌంటర్లలో రూపాయల 151 రూపాయలు చెల్లించి బుకింగ్ చేసుకోవాలని సూచించారు. భక్తులు ఎంతో నియమ, నిష్టలతో ధాన్యాన్ని గోటితో వలిచి కోటి బియ్యం గింజలను సీతారాముల కల్యాణోత్సవానికి తలంబ్రాలుగా సిద్ధం చేస్తారని, కల్యాణోత్సవం అనంతరం భక్తులు ఎంతో పవిత్రంగా ఇంటికి తీసుకెళ్లి భగవంతుని వద్ద నిల్వ ఉంచుతారని అన్నారు. ఈ తలంబ్రాలను పెళ్లిళ్లు మొదలగు శుభకార్యాలలో అక్షింతలుగా వాడితే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకమని అన్నారు. ఎంతో పవిత్రమైన శ్రీ సీతారాముల తలంబ్రాలు కావలసిన భక్తులు టిఎస్ ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విజేందర్ రెడ్డిని 96522 67204 9849 567 204 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Admin
Ekaburu