Ekaburu - తెలంగాణ / రంగారెడ్డి : జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రంగారెడ్డి జిల్లా మాస్టర్లకు హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. శనివారం చందానగర్ లోని పిజెఆర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి హోప్ ఫౌండేషన్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమ హోప్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి, మాస్టర్స్ లో జిల్లాను అగ్రభాగాన నిలుపాలని సూచించారు.
Also Read : ప్రధానమంత్రి ఫసల్బీమా యోజనలో తిరిగి చేరిన తెలంగాణ రాష్ట్రం
జాతీయ మాస్టర్స్ పోటీల్లో బంగారు పథకాలు సాదించిన జానకి మిత్రా, సుంకర మల్లేశ్వరి, దుర్గా గోపాల కృష్ణన్ లను రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అథ్లెట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో వివిద విభాగాల్లో పథకాలు సాధించిన 60మంది మాస్టర్స్ క్రీడాకారులను హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందజేసి ప్రోత్సహించడం జరిగిందని కొండా విజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి నూనె సురేందర్, ట్రెజరర్ స్వాతిగౌడ్, చిరంజీవులు, కోచ్ డగ్లస్, జ్యోతి, శివలీల రెడ్డిలతో పాటు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu