Ekaburu - తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణలో చెరువులను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతర పరంపర కొనసాగుతుంది ఓవైపు హైడ్రా చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణం పై ఉక్కు పాదం మోపుతుండగా స్థానిక రెవెన్యూ అధికారులు సైతం హైడ్రా బాటలో నడుస్తున్నారు గురువారం హైదరాబాద్ నగరంలో మూసి ఆక్రమణల సర్వేలో హైడ్రా అధికారులు బిజీగా ఉండగా సంగారెడ్డిలో చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై స్థానిక అధికారులు కొరడా జలుపించారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువు మధ్యలో అక్రమంగా నిర్మించిన ఇంటిని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. చెరువు నీటి మధ్యలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త బహుళ అంతస్థుల నిర్మాణం చేపట్టి, గెస్ట్ హౌస్ గా వాడుకుంటున్నాడు. చెరువు నీటి మధ్యలో కట్టిన ఈ బిల్డింగ్ను గురువారం అధికారులు బ్లాస్టింగ్ చేసి కూల్చివేశారు. బ్లాస్టింగ్ చేసే క్రమంలో బిల్డింగ్ శకలాలు తగిలి హోంగార్డు గోపాల్కు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను హాస్పిటల్కు తరలించారు.
Admin
Ekaburu