Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కోసం యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోసర్వం సిద్ధం చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 10 రౌండ్లలో ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. ఒకటో నెంబర్ పోలింత్ బూత్ షేక్పేట డివిజన్ నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్ ఎర్రగడ్డతో ముగియనుంది. షేక్ పేట డివిజన్ తో ప్రారంభమై వెంగళ్ రావు నగర్ , రహమత్ నగర్, యూసఫ్ గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లతో పూర్తి కానుంది.
Also Read : ఆముదం గింజల నుండి 'రిసిన్' విషం
Admin
Ekaburu