Wednesday, 22 April 2026 07:15:57 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఇంజనీరింగ్ విద్యార్థికి లయన్స్ క్లభ్ ఆఫ్ హోప్ ప్రోత్సాహం

కళాశాల ఫీజు కోసం రూ 30 వేల నగదు అందచేత

Date : 02 August 2024 06:17 AM Views : 1015

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ హుడాకాలనీకి చెందిన రంగారెడ్డి కుమార్తె మాణిక్య రెడ్డి కళాశాల ఫీజు కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ ఆర్థిక సహాయం అందజేసింది. మాల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న మౌనిక రెడ్డి చదువుల్లో ఉత్తమంగా రాణిస్తుండగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మౌనిక రెడ్డికి గత మూడు సంవత్సరాలు గా కళాశాల ఫీజు కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ ఆర్థిక సహాయం అందజేస్తుంది. కాగా ఈ సంవత్సరం కళాశాల ఫీజు కోసం మౌనిక రెడ్డికి లయన్స్ క్లభ్ ఆఫ్ హోప్ 30 వేల రూపాయలను చందానగర్ లోని హోప్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ జోన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ అందజేశారు.

Also Read : శేరిలింగంపల్లిలో బిఆర్ఎస్ శ్రేణుల ఆందోళన

ఈ సందర్భంగా జోన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ క్లభ్ ద్వారా గత 3 సంవత్సరాలుగా మౌనిక రెడ్డికి ఆర్థిక సహయం అందచేస్తున్నట్లు తెలిపారు. లయన్స్ క్లభ్ ఆఫ్ హోప్ ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యాక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. చదువుల్లో ఉత్తమంగా రాణించే విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కావద్దని, లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ ఇటువంటి విద్యార్థులను గుర్తించి ప్రోత్సాహిస్తుందని విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లభ్ అద్యక్షుడు బసిరెడ్డి మధూసుధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి భూషన్ రెడ్డి, ట్రెజరర్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి, మారం వెంకట్, నూకల సందీప్ , మారం ప్రసాద్ ,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :