Wednesday, 22 April 2026 07:27:03 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

చిత్రపురి కాలనీ ప్లాట్ల కేటాయింపులో గోల్ మాల్...

చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనీల్ అరెస్టు

Date : 23 May 2024 08:58 AM Views : 995

Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనీల్ కుమార్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. చిత్రపురి కాలనీ ప్లాట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై బాధితులు రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అధ్యక్షుడు అనీల్ కుమార్ ను అరెస్టు చేశారు. అనీల్ కుమార్ అరెస్టుతో పాటు కమిటీలో సభ్యులైన పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాలా, చంద్రమధు, కాదాంబరి కిరణ్, మహానంద రెడ్డిలతో పాటు చనిపోయిన సోసైటీ మాజీ అధ్యక్షుడు కొమర వెంకటేష తదితరుల మీద 420, 120బీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Also Read : గచ్చిబౌలి అమెజాన్ ఐటీ సంస్థలో భారీ మోసం

మార్చి 7న తొటశ్రీ పద్మ అనే మహిళ మార్చి 7వ తేదీన 12 లక్షలు చెల్లిస్తే ఫ్లాటును తనకు బదులుగా మరోకరికి రిజిస్ట్రేషన్ చేశారని రాయదుర్గం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. యనమల మాదవ్ మార్చి 20న 4 లక్షలు చెల్లించగా, తనకు కేటాయించిన ప్లాటు రద్దు చేయడంతో పాటు డబ్బులు తిరిగి ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు మరికొందరు బాధితులు సైతం రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. బాధితులు దాదాపు 150 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఒక్కో బాధితుని నుంచి 4 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూళ్లు చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిందని పోలీసులు తెలిపారు.ఈ అవకతవకలకు కమిటీ అధ్యక్షుడు అనీల్ కుమార్ ను భాద్యుడిగా తేల్చిన పోలీసులు అనీల్ కుమార్ ను అరెస్టు చేయడంతో పాటు అధికారుల పాత్రపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :