Ekaburu - తెలంగాణ / హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనీల్ కుమార్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. చిత్రపురి కాలనీ ప్లాట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై బాధితులు రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అధ్యక్షుడు అనీల్ కుమార్ ను అరెస్టు చేశారు. అనీల్ కుమార్ అరెస్టుతో పాటు కమిటీలో సభ్యులైన పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాలా, చంద్రమధు, కాదాంబరి కిరణ్, మహానంద రెడ్డిలతో పాటు చనిపోయిన సోసైటీ మాజీ అధ్యక్షుడు కొమర వెంకటేష తదితరుల మీద 420, 120బీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read : గచ్చిబౌలి అమెజాన్ ఐటీ సంస్థలో భారీ మోసం
మార్చి 7న తొటశ్రీ పద్మ అనే మహిళ మార్చి 7వ తేదీన 12 లక్షలు చెల్లిస్తే ఫ్లాటును తనకు బదులుగా మరోకరికి రిజిస్ట్రేషన్ చేశారని రాయదుర్గం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. యనమల మాదవ్ మార్చి 20న 4 లక్షలు చెల్లించగా, తనకు కేటాయించిన ప్లాటు రద్దు చేయడంతో పాటు డబ్బులు తిరిగి ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు మరికొందరు బాధితులు సైతం రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. బాధితులు దాదాపు 150 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఒక్కో బాధితుని నుంచి 4 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూళ్లు చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిందని పోలీసులు తెలిపారు.ఈ అవకతవకలకు కమిటీ అధ్యక్షుడు అనీల్ కుమార్ ను భాద్యుడిగా తేల్చిన పోలీసులు అనీల్ కుమార్ ను అరెస్టు చేయడంతో పాటు అధికారుల పాత్రపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.
Admin
Ekaburu