Saturday, 18 April 2026 07:07:33 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఇష్టపడి.. ఆశపడి.. కిడ్నాప్ చేసి...

టీవీ యాంకర్ ను కిడ్నాప్ చేసిన మహిళా వ్యాపారవేత్త...

Date : 23 February 2024 06:46 PM Views : 838

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఇప్పటి వరకు అబ్బాయిలు ఇష్టపడిన అమ్మాయిలను కిడ్నాప్ చేయడం చూశాం. కానీ ఇక్కడ ఓ మహిళా వ్యాపారవేత్త తాను ఇష్టపడిన అబ్బాయిని కిడ్నాప్ చేయించి వేదింపులకు గురిచేసింది. పార్ట్ టైం ఛానల్ యాంకర్ గా పనిచేస్తున్న సదరు యువకుడు కిడ్నాపర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ సిటీలో సంచలనం రేపిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నగరంలో నివాసం ఉండే భోగిరెడ్డి త్రిస్నా అనే యువతి డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేయడంతో పాటు నాలుగు స్టార్టప్ కంపెనీలకు ఫౌండర్. త్రిస్నా పెళ్లి సంబందాలు వెదుకుతూ భారత్ మ్యాట్రిమోనీలో యాంకర్ ప్రవీణ్ ఐడీని గుర్తించింది. ఫొటో చూసి ట్యాగ్ చేసింది. ఇద్దరూ మంచిగా మాట్లాడుకున్నారు. ఫోన్ లో జరిగిన మాటలతోనే యాంకర్ ప్రవీణ్ అంటే బాగా ఇష్టం పెంచుకుంది. ప్రవీణ్ కు మరింత దగ్గర కావాలనుకున్న త్రిస్నాకు అనుకోని షాక్ తగిలింది. యాంకర్ ప్రవీణ్ ను డైరెక్టుగా కలిసిన త్రిస్నాకు ఆన్ లైన్ ప్రొఫైల్ ఐడీ ప్రవీణ్ ది కాదని తెలిసింది. యాంకర్ ప్రవీణ్ ఫొటోలు, ప్రొఫైల్ తో కొందరు వ్యక్తులు ఫేక్ ఐడి ని క్రియేట్ చేసినట్టు తెలుసుకుంది. ఇదే విషయాన్ని త్రిస్నానే.. ప్రవీణ్ కు చెప్పింది. దీంతో ఫేక్ ఐడీపై అప్పట్లోనే సైబర్ క్రైంకు కంప్లయింట్ చేశాడు ప్రవీణ్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది.

ప్రవీణ్ తో స్నేహన్ని త్రిస్నా ఇష్టంగా మార్చుకోగా, ప్రవీణ్ మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. త్రిస్నాను కలవడానికి, మాట్లాడటానికి సైతం ప్రవీణ్ ఇష్టపడే వాడు కాదు ప్రవీణ్. దీంతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని కోపం పెంచుకున్న త్రిస్నా ప్రతీకారం కోసం పథకం వేసింది. తన పథకంలో భాగంగా ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న ప్రవీణ్ ను కిడ్నాప్ చేయించింది. రహస్య ప్రదేశంలో బంధించి, కొట్టించింది. కిడ్నాపర్ల చెరలో ఉన్న ప్రవీణ్ మాటలతో నమ్మించి, వారి చెర నుంచి తప్పించుకున్నాడు. అనంతరం ఉప్పల్ పోలీసు స్టేషన్ లో ప్రవీణ్ పిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :