Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : భారత దేశాన్ని అగౌరపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద మీద గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు అందింది. సింగర్ చిన్మయి వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి, యూత్ కెన్ లీడ్ సభ్యుడు ఎం. కుమార్ సాగర్ పిర్యాదు చేశారు. ఓ యూ ట్యూబ్ ఛానల్ వేదికగా జరిగిన ఇంటర్వ్యూలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాటలకు కౌంటర్ గా సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో వీడియో పోస్టు పెట్టారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఈ పోస్టులో భారత దేశాన్ని స్టుపిడ్ కంట్రీ( చెత్త దేశం) గా, భారత దేశంలో పుట్టడం నా కర్మా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సింగర్ చిన్మయి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన హెచ్ సీయూ విద్యార్థి కుమార్ సాగర్ గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేశారు. అన్నపూర్ణమ్మ వ్యాఖ్యల మీద అభ్యంతరం ఉంటే నేరుగా ఖండించవచ్చని, కానీ భారత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదని కుమార్ సాగర్ అన్నారు. భారతదేశంలో ఉంటూ, భారతదేశ సౌకర్యాలు అనుభవిస్తూ, భారత దేశపు గాలి పీల్చి. భారత దేశం లో పుట్టడమే కర్మ అనడం... భారతదేశం ఒక చెత్త దేశం అని అనటం బాధని, కోపాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. బాధ్యత గల పౌరుడిగా భారత దేశం పట్ల అగౌరవమైన & అనుచిత వ్యాఖ్యలను కిండిస్తు గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో పిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు. సింగర్ చిన్మయి శ్రీపాద పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా గతంలో సైతం సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.
Admin
Ekaburu