Wednesday, 22 April 2026 07:11:03 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

మాదాపూర్ సాఫ్టువేర్ సంస్థలో అనుమానస్పద అగ్నిప్రమాదం

15 రోజుల క్రితమే ఉద్యోగులను తొలగించిన క్యామేల్ క్యూ సంస్థ

Date : 13 September 2025 07:41 PM Views : 430

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : మాదాపూర్ లో కొన్ని నెలల క్రితమే ఏర్పాటు చేసిన ఓ సాఫ్టువేర్ సంస్థలో శనివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో అగ్నిప్రమాదం సంభవించింది. గతంలో కేపీహెచ్బీ లో ఉన్న సదరు సంస్థ కొన్ని నెలల క్రితమే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో కార్యాలయం ప్రారంభించగా, ప్రాజెక్టులు లేని కారణంగా 15 రోజుల క్రితమే తన 80శాతం ఉద్యోగులను ఈ సంస్థ ఉద్యోగాల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఏసీలు, పలు లాప్టాప్ లు కాలిపోయాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఓ భవనం 2వ అంతస్థులో క్యామేల్ క్యూ సాఫ్టువేర్ సంస్థ ఉంది. గతంలో కేపీహెచ్బీ లో ఈ సంస్థ కార్యాలయం ఉండగా, గత 4,5 నెలల క్రితమే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ కి మారినట్టు తెలుస్తోంది. కాగా ఈ సంస్థ కు ఎటువంటి ప్రాజెక్టులు లేకపోవడంతో గత 15 రోజుల క్రితమే ఇక్కడ పనిచేస్తున్న 80శాతం మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించినట్టు స్థానికులు తెలిపారు. కాగా శుక్రవారం రోజుమాదిరిగానే సాయంత్రం కార్యాలయం మూసివేసి నిర్వాహకులు వెళ్లిపోయారు.

శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో క్యామేల్ క్యూ సంస్థ కార్యాలయం నుంచి పొగలు రావడంతో స్థానికులు పోలీసులు, ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అర్పివేశారు. ఈ అగ్నిప్రమాదం లో క్యామేల్ క్యూ సంస్థలో ఉన్న పలు ఏసీలు, లాప్టాప్ లు కాలిపోయినట్టు తెలుస్తుంది. కాగా ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్టు నిర్వాహకులు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అ, లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అగ్నిప్రమాదం సమయంలో కార్యాలయం మూసి ఉండడం, ఉద్యోగులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని, స్వల్ప ఆస్థి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :