Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని మణికొండలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఉన్న యువకుల మధ్య ఓ యువతి విషయంలో ఏర్పడిన వివాదం హత్యకు దారితీసింది. నగరంలోని టోలిచోకీలో నివాసం ఉండే విశాల్ సింగ్ గతంలో మణికొండలో నివాసం ఉండే యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెద్దలు కల్పించుకొని విశాల్ సింగ్ ను మందలించారు. శుక్రవారం విశాల్ సింగ్ కు ఫోన్ చేసిన యువతి సోదరుడు శ్యామ్ మణికొండకు రమ్మన్నాడు. మణికొండలో విశాల్ సింగ్ తో కలిసి శ్యామ్ అతని స్నేహితులు భయ్యా, అర్జున్, సుమన్, రాజేష్,సోని, అరుణ్ లు మద్యం సేవించారు. మద్యం మత్తులో శ్యామ్ సోదరి విషయం రావడం, విశాల్ సింగ్ అసభ్యంగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో శ్యామ్ అతని స్నేహితులు విశాల్ సింగ్ మీద కర్రలతో దాడి చేయడంతో విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన విశాల్ సింగ్ ను పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. విశాల్ ను హత్య చేసిన శ్యామ్, అతని స్నేహితులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
Also Read : సోమేశ్వర స్వామి ఆలయ ప్రత్యేక పూజల్లో మాజీ కార్పొరేటర్ సాయిబాబా
Admin
Ekaburu