Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : బైక్ రేసింగ్ లకు పాల్పడి రహదారుల మీద భయానక వాతావరణం సృష్టిస్తే జైలు శిక్ష తప్పదని మాదాపూర్ ఏసిపి శ్రీకాంత్ బైకర్లను హెచ్చరించారు. ఐటీ కారిడార్ పరిధిలో అర్థరాత్రి వేళల్లో గతకొంత కాలంగా బైక్ రేసింగ్ లు జరుగుతుండడంతో రాయదుర్గం పోలీసులు దాడులు చేసి ఇప్పటి వరకు 89 బైక్ లను సీజ్ చేయడంతో పాటు 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈమేరకు శుక్రవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాయదుర్గం ఇన్స్ పెక్టర్ వెంకన్నతో కలిసి ఏసిపి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సువిశాలమైన ఐటి కారిడార్ రహదారుల మీద కొంతమంది యువత ఆర్థరాత్రి వేళల్లో బైక్ రేసింగ్ లు చేపడుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు.
Also Read : ఐటీ కారిడార్ లో అర్ధరాత్రి బైక్ రేసింగ్ లు
ఐటి కారిడార్ పరిధిలోని టిహబ్, నాలెడ్జ్ సిటీ, కోహినూర్ బిల్డింగ్ తదితర ప్రాంతాల రహదారులు అర్థరాత్రుల సమయంలో నిర్మాణుష్యంగా, సువిశాలంగా ఉండడంతో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు వచ్చి రేసింగ్ లకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ రేసింగుల కారణంగా స్థానికంగా భయానక వాతావరణం ఏర్పడడంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాయదుర్గం పోలీసులు బైక్ రేసింగ్, బైక్ స్టంట్లు నిర్వహిస్తున్న వలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారని తెలిపారు. వారాంతాల్లో కొనసాగతున్న ఈ రేసింగ్ ల మీద గత నెల రోజులుగా పోలీసులు పక్కా నిఘా ఏర్పాటు చేసి దాడులు చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు రేసింగ్లకు పాల్పడుతున్న 89 బైకులు 2 కార్లను సీజ్ చేసినట్లు తెలిపారు. మొత్తం 9 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. 89మంది రైడర్ల మీద కేసు నమోదు చేసి 4గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
Admin
Ekaburu