Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : రోజు మాదిరిగానే ఉత్సాహంగా కార్యాలయానికి వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తాను పనిచేస్తున్న సాఫ్ట్వేర్ సంస్థ నుంచి బయటకు వచ్చి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం సాఫ్ట్వేర్ ఉద్యోగి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేయగా, సాయంత్రానికి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియడం విషాదాన్ని నింపింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ వరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... ముషిరాబాద్ కు చెందిన ఎం. బాలాజీ(25) నాలెడ్జ్ సిటీలోని ఐటీ సంస్థ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈనెల 24వ తేదీన ఉదయం ఆఫీసుకు వచ్చిన బాలాజీ అర్ధరాత్రి ఐనా తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితుల వద్ద విచారించిన కుటుంబ సభ్యులు బాలాజీ ఆచూకీ లభించకపోవడంతో 25వ తేదీన తెల్లవారు జామున రాయదుర్గం పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.
Also Read : ఐటీ కారిడార్ నడిబొడ్డున డ్రగ్స్, విదేశీ మద్యంతో 'రేవ్ పార్టీ
పోలీసులు ఐటీ కంపెనీలో విచారించగా 24వ తేదీ రాత్రి 8.30కు బయటకు వెళ్లినట్టు గుర్తించారు. స్థానిక సీసీ కెమెరాలను పరిశీలిస్తే మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా కిందకు దిగినట్టు గుర్తించారు. ఓ వైపు పోలీసులు బాలాజీ కోసం గాలిస్తుండగా, శుక్రవారం సాయంత్రం బాలాజీ మృతదేహం దుర్గం చెరువు నీటిలో కనిపించింది. మెడలో ఉన్న ఐడి కార్డు ఆధారంగా బాలాజీ గా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే బాలాజీ ఆత్మహత్య కు కారణమని అనుమానిస్తున్నారు. బాలాజీ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడని, యువతి పెళ్ళికొసం ఒత్తిడి చేయగా, తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక బాలాజీ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Admin
Ekaburu