Ekaburu - క్రైమ్ / : రాయదుర్గం మధురానగర్ లోని జునియర్ కళాశాల లో ఇంటర్ మెదటి సంవత్సరం చదువుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన జశ్వంత్(17) తన ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల నుంచి ఆలస్యంగా వచ్చాడని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురైన జశ్వంత్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి పరిధిలోని పిజెఆర్ నగర్ లో తల్లి, సోదరుడితో కలిసి జశ్వంత్ నివాసం ఉండేవాడు. తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Ekaburu