Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మాదాపూర్ పోలీసు స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న రంజిత్, అతని రైటర్ లు 20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శనివారం పట్టుకున్నారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ సిబ్బంది అవినీతిపై ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు గత రెండు రోజులుగా నిఘా పెట్టారు. ఈ మేరకు శనివారం మాదాపూర్ పోలీసు స్టేషన్ లో తనిఖీ లు చేపట్టిన ఏసీబీ అధికారులు ఓ కేసు విషయంలో 20వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ రంజిత్, అతని రైటర్ విక్రమ్ లను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు ఎస్ఐ, రైటర్ లను విచారిస్తున్నారు.
Also Read : బొటానికల్ గార్డెన్ లో కొండా సంగీతా రెడ్డి ప్రచారం
Admin
Ekaburu