Wednesday, 22 April 2026 05:03:46 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

బొటానికల్ గార్డెన్ లో కొండా సంగీతా రెడ్డి ప్రచారం

బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని అభ్యర్థన

Date : 06 April 2024 12:05 AM Views : 920

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : పేదవారిని ఆదుకునే మనసున్న చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ విశ్వేశ్వరరెడ్డి సతీమణి కొండా సంగీత రెడ్డి శుక్రవారం బొటానికల్ గార్డెన్ లో ప్రచారం నిర్వహించారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ లోని మార్నింగ్ వాకర్స్ తో సమావేశమైన సంగీతా రెడ్డి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా విశ్వేశ్వరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సంగీతా రెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో నేడు భారత దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, అవినీతిరహిత పాలన అందించిన మోదీని మరోసారి ప్రధాన మంత్రిని చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Also Read : 30వ అంతస్థు నుంచి కిందపడి కార్మికుడి మృతి

నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే కొండా విశ్వేశ్వరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి, చేవెళ్ల విజయాన్ని మోడీకి బహుమతిగా అందించాలని అన్నారు. ఓటు వేసే ముందు బీజేపీ నేతృత్వంలో దేశం ఎంత పటిష్టమైన దిశలో పయనిస్తుందో గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, నాయకులు ఆంజనేయులు, భాస్కర్ రెడ్డి, సంతోష్, శ్రీశైలం యాదవ్, రవి నాయక్, ప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :