Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : శేరిలింగంపల్లి పరిధిలోని చందానగర్ లో మంజీరా పైప్ లైన్ పగిలి బ్లో ఆఫ్ తో మంచినీరు ఎగసిపడుతుంది. మంజీరా పైప్ లైన్ గేట్ వాల్ వద్ద లీకేజీతో మంచినీరు 15 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతుండగా, దీనికి పైనే విద్యుత్ తీగలు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చందానగర్ పరిధిలోని శ్వేతా గార్డెన్ సమీపంలో మంజీరా నీటి పైప్ లైన్ కు మంగళవారం ఉదయం లీకేజీ ఏర్పడింది. దీని కారణంగా దాదాపు 15 మీటర్ల ఎత్తులో త్రాగునీరు ఎగిసిపడుతుంది. నగరానికి మంచినీటిని అందించే విలువైన త్రాగునీరు వృధాగా పోతుంది. ఈ పైప్ లైన్ మీద విద్యుత్ తీగలు ఉండగా.. ఎగిసిబడుతున్న నీరు విద్యుత్ తీగలకు తగులుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు ఈ దారిలో రాకపోకలను నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు.
Also Read : సున్నం చెరువు హైడ్రా కూల్చివేత బాధితులతో బీఆర్ఎస్ దీపావళి వేడుకలు
Admin
Ekaburu