Saturday, 18 April 2026 07:12:06 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

లిక్కర్‌ స్కామ్‌ కేసులో వారికి ఊరట

బెయిల్ మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

Date : 16 March 2024 03:02 PM Views : 934

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. తాజాగా ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టుచేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శనివారం కోర్టు నుంచి ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టుకు శనివారం కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాదోపవాదాల తర్వాత ధర్మాసనం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు, రూ.15 వేలు బాండ్‌పై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా.. ఇదే కేసులో గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్‌కు 8 సార్లు సమన్లు ​​జారీ చేసింది. అయినప్పటికీ.. ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో కేజ్రీవాల్ విచారణకు సహకరించడంలేదని కోర్టుకు ఈడీ ఫిర్యాదు చేసింది. ఈడీ ఫిర్యాదుతో కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు జారీ చేయడంతో విచారణకు హాజరు కాగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Also Read : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :