Wednesday, 22 April 2026 05:03:45 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఒలింపిక్స్ లో హాకీ జట్టు గెలుపుతో పిజెఆర్ స్టేడియంలో సంబురాలు

భారత్ లో హాకీ క్రీడకు పూర్వవైభవం ఖాయం : కొండా విజయ్ కుమార్

Date : 10 August 2024 06:56 AM Views : 1253

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంతో శేరిలింగంపల్లి పరిధిలోని చందానగర్ లో విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ హాకీ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చందానగర్ లోని పిజెఆర్ స్టేడియంలో క్రీడాకారులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ పారిస్ ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు విజయం సాధించి కాంస్య పతకం సొంతం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. హాకీ క్రీడలో భారత్ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. ప్రస్తుత భారత జట్టు ప్రదర్శన, హాకీకి లభిస్తున్న ఆదరణ చూస్తే త్వరలోనే హాకీ క్రీడకు దేశంలో పూర్వవైభవం రావడం ఖాయమని అన్నారు. భారత హాకీ జట్టు వరుసగా 2020, 2024 ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి దేశ ప్రజలను సంతోషంలో నింపిందన్నారు. ఒలింపిక్స్ వంటి విశ్వ క్రీడా సంగ్రామంలో కాంస్య పతకం సాధించిన హాకీ జట్టును విజయ్ కుమార్ అభినందించారు. తెలంగాణ హకీ ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో హకీ జాతీయ పోటీలు నిర్వహిస్తున్నట్లు కొండ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  స్టేడియం కోచ్ లు నవీన్, మహేశ్, లక్ష్మణ్, శ్రీకాంత్, వెంకటేశ్, రవితో పాటు క్రీడాకారులు, చిన్నారులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :