Thursday, 15 January 2026 07:14:02 AM
# శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్ # కొండాపూర్ లో 'బగ్గా' పై భగ్గుమన్న కాలనీవాసులు # అంజయ్య నగర్ పార్కు కబ్జా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం # తాళం పగులగొట్టే పనిలేదు.. డిజిటల్ స్క్రీన్ ల మీదే సర్వం లూఠీ

కొండాపూర్ లో 'బగ్గా' పై భగ్గుమన్న కాలనీవాసులు

Date : 03 December 2025 04:46 PM Views : 174

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : రెసిడెన్షియల్ కాలనీలో నివాస గృహాల మధ్య వైన్ షాపు ఏర్పాటు చేయడంపై కాలనీవాసులు బగ్గుమన్నారు. వైన్ షాపు ఏర్పాటు కోసం అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని వెంటనే తొలగించాలంటూ జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కాలనీలో వైన్ షాపు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో భద్రతాపరమైన ఇబ్బందులు ఏర్పడతాయని, స్థానికులకు ఇబ్బందికరంగా మారుతుందని వాపోయారు. జిహెచ్ఎంసి నుంచి ఎటువంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో ఓ వైన్ షాపు కోసం కొత్తగా ఖాళీ స్థలంలో అక్రమ షెడ్డు నిర్మాణం చేపడుతున్నారు. జిహెచ్ఎంసి నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా చేపడుతున్న ఈ షెడ్డులో బగ్గా వైన్ షాపు ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న కాలనీవాసులు ఆందోళనకు దిగారు.

Also Read : అంజయ్య నగర్ పార్కు కబ్జా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం

కాలనీవాసుల అభ్యంతరాలను పట్టించుకోకుండా నిర్మాణదారులు సదరు అక్రమ నిర్మాణాన్ని జోరుగా కొనసాగిస్తుండడంతో రాజరాజేశ్వరి రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రెసిడెన్షియల్ కాలనీలో, నివాస గృహాల మధ్య వైన్ షాపు కోసం అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డు ను వెంటనే అడ్డుకోవాలని కోరారు. జిహెచ్ఎంసి నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా సర్కిల్ పరిధిలోని కొందరు అధికారుల అండదండలతో కొనసాగుతున్న ఈ నిర్మాణాన్ని వెంటనే కూల్చివేసి వైన్ షాపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :