Saturday, 18 April 2026 07:14:13 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో స‌ఫారీ కిడ్ ప్రీస్కూల్

ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల య‌శ‌స్వినీరెడ్డి

Date : 28 February 2024 08:40 PM Views : 891

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : బాల్య విద్యా విధానంలో అంతర్జాతీయ బ్రాండ్ సఫారీ కిడ్ ప్రీస్కూల్ తన డేకేర్ బ్రాంచ్ ను గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో ఏర్పాటు చేసింది. 2005లో సిలికాన్ వ్యాలీలో ప్రారంభ‌మైన సఫారీ కిడ్ అమెరికా, కెనడాతో పాటు భారత్ లో 50 కి పైగా కేంద్రాలతో అంత‌ర్జాతీయంగా పేరు సాధించింది. దేశంలోని టెక్ పార్కుల్లో మొదటి సరిగా నగరంలోని నానక్ రాంగూడలో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ ను బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల య‌శ‌స్వినీరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో ప‌లువురు విద్యావేత్త‌లు, త‌ల్లిదండ్రులు, పిల్ల‌లు, స‌ఫారీ కిడ్ గ్రూపు నాయ‌క‌త్వ బృందం, సెంట‌ర్ ఫ్రాంచైజీ భాగ‌స్వామి, టెక్ లీడ‌ర్ సాహితీరెడ్డి పాల్గొన్నారు.

Also Read : పార్సిల్ తో ఉడాయించిన ఉబర్ బైక్ రైడర్

ఈ సందర్భంగా సఫారీ కిడ్ ఇండియా ఛైర్మన్ జితేంద్ర కర్సన్ మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో ఐటీ నిపుణులు ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని, సఫారీ కిడ్ పరిశోధన ఆధారిత, ప్రగతిశీల బోధనా విధానం ఐటీ ఉద్యోగుల కుటుంబాల అభిమానాన్ని చూరగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి దేశం అంతటా 10 అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన‌ బోధనా పాఠ్య ప్రణాళికలతో చిన్నారుల ప్రారంభ విద్యను ఉజ్వల భవిష్యత్ కు పునాదిగా మార్చడమే సఫారీ కిడ్ విధానమన్నారు.స‌ఫారీ కిడ్ ప్రీస్కూల్ డేకేర్ స‌మాచారం కోసం www.safarikidindia.com సంప్రదించాలని కోరారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :