Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : వ్యక్తిగత, కుల, మత, ప్రాంత అభిప్రాయాలకన్నా ప్రతి ఒక్కరికి జాతీయ భావనే అత్యుత్తమంగా ఉండాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి గంగాధర్ రెడ్డి అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోమవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ నుంచి ప్రారంభమైన ర్యాలీ డివిజన్ మొత్తం కొనసాగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ తో కలిసి ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరు వారి ఇంటిపై జాతీయ జెండాను ఎగర వెయ్యాలని, ప్రతి ఒక్కరూ నా దేశం అని భావించినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు.
Also Read : బ్లూమ్ ఫీల్డ్ గేటెడ్ కమ్యూనిటీలో సౌండ్ పొల్యూషన్ వివాదం
అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తై 78వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మన దేశం, మన జెండా నినాదంతో ప్రతి ఇంటిపై మన దేశ గౌరవం మన జెండా ఎగరాలనే సంకల్పంతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం రూపొందించారని అన్నారు, మన దేశంలోని ప్రతి పౌరుడు మన జాతీయ జెండాను మొబైల్ స్టేటస్ లో, సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి, నేటి యువత, విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, హనుమంత్ నాయక్, మీన్ లాల్, వరలక్ష్మి, శివాసింగ్, వినితా సింగ్, గోపాల్, కిషన్ , రంజిత్, సీతా, కవితా భాయి, సంకేశ్, బబ్లూ,నరసింహ, ప్రకాష్ లతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Ekaburu