Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : నగరాలు, పట్టణ ప్రజలు ఓటింగ్ మీద శ్రద్ధ చూపించరనే అపవాదును రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు దూరం చేయాలని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య కొండా సంగీతా రెడ్డి అన్నారు. పోలింగ్ డేను హాలిడేగా కాకుండా, మన భవిష్యత్తును మార్చే సందర్భంగా భావించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన భర్త, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి అపర్ణ సైబర్ కమ్యూనిటీలో ఆదివారం ప్రచారం నిర్వహించారు.
Also Read : గంజాయి ట్రాన్సుపోర్టు 'వయా' ఔటర్ రింగురోడ్డు
ఈ సందర్భంగా సంగీతా రెడ్డి మాట్లాడుతూ మే 13వ తేదీన ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటింగ్ లో పాల్గొనాలని, దేశ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీని సమర్థిస్తూ బిజెపికి ఓటువేసి గెలిపించాలని కోరారు. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో నెలకొన్న సమస్యలపై కొండా విశ్వేశ్వరరెడ్డికి పూర్తి అవగాహన ఉందని, కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి చేవెళ్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విశ్వేశ్వరరెడ్డిని పార్లమెంటు సభ్యుడిగా గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని మరోసారి ప్రధానిగా గెలిపించేందుకు ప్రతి ఒక్కరు బిజెపికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కాక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు, కార్యకర్తలు, అపర్ణ కమ్యూనిటీ వాసులు పాల్గొన్నారు.
Admin
Ekaburu