Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ యువ, జిల్లా 320ఏ ప్రతిష్టాత్మక 'గ్రాండ్క్వీన్స్ లీడర్షిప్ అవార్డ్స్ 2024' వేడుకలను గచ్చిబౌలిలోని క్లబ్ బొటానికాలో ఘనంగా నిర్వహించారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ ఐదవ సీజన్ లో 48 మంది మహిళలను సత్కరించారు. ఈ వేడుకలకు డాక్టర్ మీర్ నవాబ్ నాసిర్ అలీ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అవార్డుల కన్వీనర్, వ్యవస్థాపకుడు డాక్టర్ సౌరభ్ సురేఖ, సహ వ్యవస్థాపకురాలు రూపా సురేఖ మాట్లాడుతూ గ్రాండ్క్వీన్స్ క్లబ్ ఈ కాన్సెప్ట్పై ఏడు సంవత్సరాలుగా పని చేస్తున్నట్లు తెలిపారు. మహిళా అచీవర్స్, లీడర్స్ తో అద్భుతమైన సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ అవార్డుల కోసం 108 రంగాల నుంచి నామినేషన్లు ఆహ్వానించామని చెప్పారు.
Also Read : అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం
ఈ అవార్డులు 2020లో హైదరాబాద్లో ప్రారంభమయ్యాయని, నాటి నుంచి భారతదేశం మొత్తం పర్యటిస్తోందన్నారు. చేనేతను ప్రోత్సహించేందుకు డాక్టర్ సౌరభ్ సురేఖా 'చర్ఖా ఫౌండేషన్' భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 15 మంది గ్రాండ్క్వీన్స్ చేనేత చీరలు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. సారీ వాక్కు సెలబ్రిటీ ఫ్యాషన్ డైరెక్టర్ శ్రీకాంత్ గతాల కొరియోగ్రాఫ్ చేశారు. 48 అవార్డు గ్రహీతలను 4కేటగిరీలుగా విభజించి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ 320ఏ జిల్లా గవర్నర్ లయన్ హరినారాయణ్ భట్టాడ్, లయన్ సీఏ ఎంకే పురోహిత్, డాక్టర్ ప్రీతి రెడ్డి, సురేష్ జగ్నాని, దర్పణ్ వాసుదేవ్, యశ్వంత్ అగర్వాల్, డాక్టర్ ఎస్.రవీందర్, డాక్టర్ ఆశిష్ చౌహాన్, విశేష్ సిన్హా, వందనా షెటే, ఎంఎస్ ఆంచల్ అగర్వాల్, డాక్టర్ జియా హస్మ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu