Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : నగరంలో గురువారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ఐటీ కారిడార్ ట్రాఫిక్ స్తంభించింది. మల్కన్ చెరువు వద్ద ప్రధాన రహదారిపై భారీ ఎత్తున వరద నీరు చేరడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ దారిలో ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. ఖాజాగూడ చౌరస్తా నుంచి షేక్ పేట్ వెళ్లే వాహనాలను పోలీసులు దారిమల్లిస్తున్నారు. గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, నాలెడ్జి సిటీ నుండి ఖాజాగుడ మీదుగా షేక్ పెట్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బయో డైవర్సిటీ నుండి షేక్ పెట్ రోడ్డు లో ప్రయాణించవద్దని వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచనలు చేశారు. బయో డైవర్సిటీ, ఐకియా, కేబుల్ బ్రిడ్జి, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45, ఫిల్మ్ నగర్ మీదుగా షేక్ పెట్ వైపు ప్రయాణించాలని సూచించారు.
Also Read : అంజయ్య నగర్ రణరంగం - ఇరువర్గాల దాడులు
Admin
Ekaburu