Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడి నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. స్విమ్మింగ్ వూల్ కు సమీపంలోనే బాలుడి కుటుంబం నివాసం ఉంటుండగా, ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నేపాల్ కు చెందిన మహేందర్ రావు, నిర్మల దంపతులు తమ కుమారుడు సూరజ్ రోత్(4)తో కలిసి గతకొన్ని రోజుల క్రితం బ్రతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చారు. మజీద్ బండలోని పారామౌంట్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటూ వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. కాగా వీరు నివాసం: ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ది క్లబ్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఉండగా, అందులో ఓ స్విమ్మింగ్ పూల్ ఉంది.
Also Read : రాయదుర్గంలో ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
ఈనెల 12వ తేదీన మద్యాహ్నం 2.50 గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటూ సూరజ్ రోత్ పక్కనే ఉన్న స్విమ్మింగ్ వూల్ వద్దకు వచ్చాడు. స్విమ్మింగ్ వూల్ గేటు తాళం వేసి ఉండగా, కింద నుంచి లోపలికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ వూల్ నీటిలో పడి మృతి చెందాడు. కొద్దిపేపటికి బాలుడు కనిపించకపోవడంతో స్థానికంగా గాలించిన బాలుడి తల్లి స్విమ్మింగ్ పూల్ వద్దకు వచ్చి చూడగా నీళ్లలో నిర్జీవంగా బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడు స్విమ్మింగ్ పూల్ లో వడిపోతున్న దృశ్యాలు అక్కడి సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Admin
Ekaburu